రాహుల్ గాంధీ ఓ పప్పు – మంత్రి మల్లారెడ్డి
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఫై టిఆర్ఎస్ పార్టీ మంత్రి మల్లారెడ్డి నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ పప్పు అంటూ విమర్శించారు. శనివారం మేడ్చల్ జిల్లా మూఢుచింతలపల్లి మండల పరిధిలోని ఉద్ధమర్రి, కేషవరం గ్రామాల్లో ధాన్యంకొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భాంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు సంఘర్షన్ అంటూ వచ్చిన పప్పు రాహుల్ ముందు వాళ్ళ ప్రభుత్వం పాలిస్తున్న రెండు, మూడు రాష్ట్రాల్లో ఎంత మేర రైతులను అదుకుంటున్నారో చూసుకోని మరీ తెలంగాణకు రావాలంటూ రాహుల్ గాంధీ పై విమర్శిలు గుపించారు. ఇప్పటివరకు పప్పు రాహుల్ హయాంలో కాంగ్రేస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా తిరిగి అధికారంలోకి రాలేక ఓడిపోయిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేవలం కేసీఆర్ తోనే సాధ్యమని.. చెప్పుకొచ్చారు.
పంజాబ్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొత్త డ్రామాలు ఆడుతున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలోనే డిక్లరేషన్ చేస్తరా.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో డిక్లరేషన్ చేయరా అని ప్రశ్నించారు.