భారత్లో కొత్తగా 11,713 పాజిటివ్ కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,14,304..మొత్తం మృతుల సంఖ్య 1,54,918
న్యూఢిల్లీ: భారత్లో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 11,713 మందికి కరోనా నిర్ధారణ అయింది.అదే సమయంలో 14,488 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,14,304 కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 120 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,54,918 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,05,10,796 మంది కోలుకున్నారు. 1,48,590 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 54,16,849 మందికి వ్యాక్సిన్ వేశారు.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,06,72,589 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,40,794 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.