వైఎస్‌ఆర్‌సిపి 8వ జాబితా విడుదల

వైఎస్‌ఆర్‌సిపి 8వ జాబితా విడుదల

YSRCP

అమరావతిః రానున్న ఎన్నికలకు సంబంధించి వైఎస్‌ఆర్‌సిపి 8వ జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను, ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటించారు. నిన్న రాత్రి ఈ జాబితాను విడుదల చేశారు. 8వ జాబితాలో కొందరు ఇంచార్జ్‌ల పేర్లను మారుస్తూ వైఎస్‌ఆర్‌సిపి కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు లోక్ సభ, ముగ్గురు అసెంబ్లీ ఇంచార్జుల పేర్లను ప్రకటించింది. గుంటూరు లోక్ సభ ఇంచార్జుగా కిలారి రోశయ్య, ఒంగోలు లోక్ సభ ఇంచార్జుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది వైఎస్‌ఆర్‌సిపి అధిష్టానం.

వైఎస్‌ఆర్‌సిపి 8వ జాబితా:

గుంటూరు ఎంపీ – కిలారు రోశయ్య
ఒంగోలు ఎంపీ – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
పొన్నూరు శాసనసభ – అంబటి మురళి
కందుకూరు శాసనసభ – బుర్రా మధుసూదన్ యాదవ్
జీడీ నెల్లూరు శాసనసభ – కల్లత్తూర్ కృపాలక్ష్మి.