వివేకా హత్య కేసు.. బెయిల్‌ కోసం హైకోర్టుకు నిందితులు

ys-viveka-murder-case-petition-of-the-accused-in-the-high-court

హైదరాబాద్‌ః మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు వైఎస్ భాస్కర్‌‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టులో బెయిల్‌ పిటిషన్ దాఖలు చేశారు. వీరిద్దరూ వేసిన బెయిల్‌ పిటిషన్‌ను జూన్‌లో సీబీఐ కోర్టు తిరస్కరించడంతో తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు విచారణ జరిపిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.