వివేకా హత్య కేసు దర్యాప్తు పై స్పందించిన వైఎస్ షర్మిల

ఈ కేసు దర్యాప్తును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదని వ్యాఖ్య

ys-sharmila

న్యూఢిల్లీ : మాజీ మంత్రి వైస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య తమ కుటుంబంలో జరిగిన ఘోరమైన ఘటన అని అన్నారు. వివేకా కుమార్తె సునీతా రెడ్డికి న్యాయం జరగాలన్నారు. సునీత కోరినట్టుగా ఈ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న షర్మిల.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాగ్ కు పిర్యాదు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె వివేకా హత్య కేసు విషయమై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తమ చిన్నాన్నను అంత ఘోరంగా ఎవరు హ్యత్య చేశారో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. వివేకా హ్యత వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయనేది సీబీఐ దర్యాప్తులో తేలిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ హత్య కేసు దర్యాప్తును ఎవ్వరూ అడ్డుకోవడానికి వీళ్లేదని షర్మిల స్పష్టం చేశారు.

మెక్సికో సిటీ: సెంట్రల్‌ మెక్సికోలోని అగాస్కాలైంటిస్‌ నగరంలో భారీ ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్‌పై ఇంధన ట్రక్కు పేలింది. దీంతో అక్కడ భారీగా మంటలు వ్యాపించాయి. అయితే ఆ మంటల మీద నుంచే ర్గో రైలు వెళ్లింది. స్థానికంగా ఉన్న సుమారు వెయ్యి మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మంటలపై నుంచి కార్గో రైలు వెళ్తుంటే కొందరు అక్కడే ఉండి వీడియోలు తీశారు. భయంతో కొందరు కార్లలోనే దాక్కుకున్నారు. సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించడంతో.. అక్కడ నుంచి సుమారు 12 మందిని రక్షించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెబుతున్నారు. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.