హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బిజెపి – టిఆర్ఎస్ కార్యకర్తల ఫైట్

హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బిజెపి – టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య బిగ్ ఫైట్ చోటుచేసుకుంది. ఈటెల రాజేందర్ వర్గీయులు అలాగే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (టీఆర్‌ఎస్) వర్గీయులు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (టీఆర్‌ఎస్) చర్చలకు సిద్ధమా అంటూ సవాల్, ప్రతి సవాళ్లు విసురుకున్న నేపథ్యంలో గురువారం హుజురాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తా ఇరు నేతల వర్గీయులు పెద్ద ఎత్తున చేరుకొని ప్లెక్సీ లు ఏర్పాటు చేసారు.

ఈ క్రమంలో ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు బాహాబాహికి దిగారు. పోలీసుల ముందే పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. బూతులు తిట్టుకున్నారు. పోటాపోటీగా నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు సభ్యులను నచ్చేజెప్పే ప్రయత్నం చేసిన ఎక్కడ తగ్గలేదు. ఇరు వర్గీయుల మధ్య తోపులాట జరగడంతో కొంత మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. సుమారు గంట పాటు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు నచ్చజెప్పడం తో కాస్త శాంతించారు.