ప్రధాని మోడీ ఫై షర్మిల ఆగ్రహం ..

లోక్ సభ ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఫై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలు మంగళసూత్రాలు తెంచి చొరబాటుదారులకు పంచి పెడుతుందంటూ ఆయన చేసిన కామెంట్స్ ఫై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల ఘాటుగా స్పందించింది.

ప్రధాని మోదీ పదేళ్లలో దేశంలో చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేక కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు తెంచుతుందని.. మళ్లీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రజల్లో ద్వేషం పెంచుతారా అని ప్రశ్నించారు. మరీ మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు సృష్టించి ఎన్ని మంగళ సూత్రాలు తెంచలేదు..? ఇప్పుడు ప్రధానిగా ఉండి మణిపూర్ ఘటనతో ఎన్ని మంగళ సూత్రాలు తెంచలేదని కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ దేశ ప్రజల్లో ప్రేమను నింపే మాటలు మాట్లాడుతుంటే.. మోదీ మాత్రం మతాలను విడదీసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీకి దమ్ముంటే చేసిన అభివృద్ధి చెప్పుకోవాలి.. అంతేకానీ ముస్లింలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఇది బీజేపీకి, ఈ దేశానికి మంచిది కాదన్నారు. బీజేపీ ఈ దేశానికి చాలా ప్రమాదమని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశ, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని.. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాస్వామ్యానికి రక్షణ అని వ్యాఖ్యానించారు.