సికింద్రాబాద్ శబరి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు
హైదరాబాద్ : సికింద్రాబాద్ శబరి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. శబరి ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేశారు. బాంబు, డాగ్ స్క్వాడ్తో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు ఎవరూ ఆందోళనకు గురికావొద్దని పోలీసులు సూచించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/