వైఎస్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళుర్పించిన రేవంత్ రెడ్డి

revanth-reddy

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భాంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు , వైఎస్ అభిమానులు ఆయనకు నివాళ్లు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో గాంధీ భవన్‌లో వైఎస్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ వైఎస్ చనిపోయే ముందు ఆయనకొక ఆకాంక్ష ఉందని, భారత దేశానికి యువనేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే కోరిక ఉందన్నారు. ఆయన ఆలోచనను అమలు చేయడం ద్వారా వైఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని టీకాంగ్రెస్ నేతలందరం భావిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మండలి విపక్ష సభ్యుడు షబ్బీర్ అలీ, నాయకులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, చామల కిరణ్ రెడ్డి, సునీతా రావ్, కుమార్ రావ్, ప్రేమ్ లాల్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.