అమరావతిలో ఫ్యాన్స్ కు షాక్ ..పవన్ కళ్యాణ్ భారీ ప్లెక్సీ ని చించేసిన అగంతకులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు 50 వసంతంలో అడుగుపెట్టారు. ఈ తరుణంలో అభిమానులు ఉదయం నుండి పుట్టిన రోజు సంబరాల్లో మునిగిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ భారీ ప్లెక్సీ లు ఏర్పటు చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే పలు సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ తరుణంలో అమరావతి లో పవన్ కళ్యాణ్ అభిమానులకు షాక్ తగిలింది.

అమరావతి లోని ఉద్దండరాయుని పాలెంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు కలిసి ఏర్పాటు చేసుకున్న భారీ ఫ్లెక్సీని నిన్న రాత్రి కొందరు అగంతకులు చించేశారు. భారీ ప్లెక్సీలో కొంత భాగం చించేయడంతో దీని రూపు కోల్పోయింది. విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. తమ అభిమాన హీరో, జనసేనాని పుట్టినరోజు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు పోలీసుల్ని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.