ప్రభుత్వ సలహాదారుల పదవీకాలాన్ని పొడిగించేందు సిఎం జగన్‌ నిర్ణయం

కృష్ణమోహన్, కల్లాం, శామ్యూల్ కు కూడా వర్తింపు

ys-jagan-to-extend-govt-advisors-tenure

అమరావతిః ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారని తెలుస్తోంది. సజ్జల సహా నలుగురు సలహాదారుల పదవీకాలాన్ని మరికొంత కాలం పొడిగించాలని నిర్ణయించినట్టు సమాచారం. సజ్జలతో పాటు జీవీడీ కృష్ణమోహన్, అజయ్ కల్లాం, శామ్యూల్ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నారు. వీరిని ముందుగా మూడేళ్ల పదవీకాలంలో నియమించింది. ఆ తర్వాత అందరకీ ఒకే పదవీకాలం ఉండాలంటూ రెండేళ్లకు కుదించింది. అయితే, ఇప్పటికే రెండుసార్లు పదవీకాలాన్ని పొడిగించిన ప్రభుత్వం మూడోసారి కూడా వారికి ఎక్స్టెన్షన్ ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.