బండి సంజయ్ పిటీషన్.. విచారణ వాయిదా

acceptance-of-bandi-sanjay’s-petition-adjournment-of-hearing

హైదరాబాద్ః బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అరెస్టు, పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టులో పిటీషన్ వేసింది బిజెపి లీగల్ సెల్. ఎంపీగా బండి సంజయ్ ను అర్థరాత్రి బలవంతంగా, అక్రమంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లటాన్ని సవాల్ చేస్తూ ఈ పిటీషన్ వేసింది పార్టీ లీగల్. ఏప్రిల్ 5వ తేదీన.. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తదుపరి ప్రక్రియను మాత్రం ఏప్రిల్ 6వ తేదీ గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు.

ఈ పిటీషన్ లో మొత్తం ఆరుగురిని ప్రతివాదులుగా చేర్చారు. హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, బొ మ్మల రామారం సీఐలను ప్రతివాదులుగా ఉన్నారు. హెబియస్ కార్పస్ పిటీషన్ విచారణకు వచ్చే ముందే.. ఎంపీ బండి సంజయ్ ను అరెస్ట్ చూపించారు పోలీసులు. అతన్ని హనుమకొండ కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో ఈ పిటీషన్ పై ఏప్రిల్ 6వ తేదీన వాదనలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.

అత్యవసరంగా దాఖలు చేసిన పిటీషన్ ను హౌస్ మోషన్ లో విచారించేందుకు నిరాకరించిన న్యాయస్థానం.. రేపు రెగ్యులర్ బెంచ్ లోనే వాదనలు వింటామని స్పష్టం చేసింది. డివిజన్ బెంచ్ లోనే ఈ పిటీషన్ పై విచారణ జరగనుంది. కరీంనగర్ లోని బండి సంజయ్ ఇంటికి వెళ్లినప్పటి నుంచి.. ఆ తర్వాత జరిగిన అన్ని పరిణామాలను ఈ పిటీషన్ లో స్పష్టం చేసింది బీజేపీ లీగల్ టీం. బండి సంజయ్ ను కోర్టులో హాజరుపరిచిన క్రమంలో.. అక్రమ అరెస్టుపైనే ప్రధానంగా విచారణ జరగనుంది.