అల్లు అర్జున్ ట్వీట్ కు కెజిఎఫ్ యూనిట్ రిప్లై ..
కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన KGF 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతూ సరికొత్త రికార్డ్స్ ను నెలకొల్పుతుంది. ప్రశాంత్ నీల్ టేకింగ్, విజన్కు సినీప్రముఖులు సైతం జైజైలు కొడుతున్నారు. యష్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫై పలువురు సినీ ప్రముఖులు స్పందించగా..తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్ర యూనిట్ ఫై ప్రశంసలు జల్లు కురిపించారు. అల్లు అర్జున్ ట్వీట్ ఫై చిత్ర నటి నటులు వరుస పెట్టి రిప్లై ఇస్తున్నారు.
‘‘థ్యాంక్ యూ అల్లు అర్జున్. మీ కృషి, అంకిత భావం నుంచే నేను స్ఫూర్తి పొందాను. మీరు ఎప్పుడు ఇంతే గొప్పగా ఉండండి’’ అని హీరో యశ్ పోస్ట్ పెట్టాడు. ‘‘థ్యాంక్ యూ సర్’’ అంటూ శ్రీ నిధి శెట్టి రిప్లై ఇచ్చింది. ‘‘మీరు సినిమాను మెచ్చుకోవడం చాలా పెద్ద విషయం. మీ ప్రోత్సాహానికి థ్యాంక్ యూ సో మచ్ అల్లు అర్జున్’’ అని ప్రశాంత్ నీల్ స్పందించాడు. ‘‘థ్యాంక్ యూ అల్లు అర్జున్. నేను నీకు పెద్ద అభిమానిని. ‘పుష్ప’ లో నీ నాటన నాకెంతో ఇచ్చింది. అటువంటి చిత్రాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నా’’ అని రవీనా టండన్ స్పందించింది.
అంతకు ముందు అల్లు అర్జున్ ఏమని ట్వీట్ పెట్టాడంటే.. ‘‘ ‘కెజియఫ్’ చిత్రబృందానికి అభినందనలు. యశ్, సంజయ్ దత్, రవీనా టండన్, శ్రీ నిధి శెట్టిలు తమ నటనతో ఆకట్టుకున్నారు. రవిబస్రూర్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ను అందించాడు. భువనగౌడ విజువల్స్తో మాయ చేశాడు. ఇతర టెక్నిషన్లు కూడా బాగా పనిచేశారు. తన విజన్ను ఎంతగానో నమ్మి ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. భారతీయ సినిమా స్థాయిని పెంచుతున్నందుకు, మంచి సినిమా అనుభూతిని అందించినందుకు థ్యాంక్ యూ’’ అంటూ అల్లు అర్జున్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు.