యాదాద్రి ఉద్ఘాటన మహోత్సవాలు..అధికారులతో మహేష్ భగవత్ రివ్యూ సమావేశం
హైదరాబాద్: యాదాద్రిలో ఈనెల 21 నుంచి 28 వరకు ఉద్ఘాటన మహోత్సవాలు జరగనున్నాయని, ఈ మహోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈనెల 28న జరిగే మహాకుంభ సంప్రోక్షణకు సీఎం కేసీఆర్ హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి సీపీ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ సీపీ సుధీర్ బాబు, ఈవో గీతారెడ్డి, డీసీపీ నారాయణ రెడ్డి, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ… యాదాద్రి ఉద్ఘాటనలో ఎలాంటి అవాంఛనీయం సంఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/