మూడో రోజు “వింగ్స్‌ ఇండియా 2024″లో సందర్శకు సందడి.. ఫోటోలు

wings-india-2024-at-hyderabad

బేగంపేటః హైదరాబాద్‌ బెగంపేట విమానాశయంలో వింగ్స్‌ ఇండియా-2024 ప్రదర్శనకు మూడో రోజు సందర్శకులను అనుమతించడంతో సందడి వాతవరణం ఏర్పడింది. మొదటి 2 రోజులు పూర్తిగా వాణిజ్యపరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు, రేపు సందర్శకులను అనుమతిస్తున్నారు. ఇందుకోసం బుక్‌మై షోలో ముందుగా టికెట్లు కొనుగోలు చేసుకోవాలి. ప్రవేశ రుసుము.. ఫీజు ఒక్కొక్కరికి రూ.750గా నిర్ణయించారు. మూడేళ్లలోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. అయితే సందర్శకులు విమానాల్లోకి నేరుగా వెళ్లే వీల్లేదు. ప్రదర్శనలో పతి విమానం పక్కన 30 అడుగుల మేర బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయా సంస్థల ప్రతినిధులు దాని ప్రత్యేకతలు వివరిస్తున్నారు. కేవలం ప్రదర్శన మాతమే కాకుండా వినోదం కోసం మధ్యాహ్నం 3 గంటలకు సంగీతోత్సవం ఏర్పాటు చేశారు.