రేపు సిఎం కెసిఆర్‌ను కలుస్తా : పొన్నాల లక్ష్మయ్య

Will meet CM KCR tomorrow: Ponnala Lakshmaiah

హైదరాబాద్‌ః రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలుస్తానని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. కెటిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. సీనియర్ నాయకుడిపై మాట్లాడటానికి రేవంత్ రెడ్డికి ఎంత ధైర్యం అని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు పోయాయి. కాంగ్రెస్ పార్టీలోకి ఇలాంటి వాళ్లు వచ్చి భ్రష్టు పట్టిస్తున్నా. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి అసెంబ్లీ సీటు గెలిచారా..? అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చిన తరువాత కోడంగల్ లో ఓడిపోయారు. కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. జానారెడ్డి గారు కూడా రెండుసార్లు ఓడిపోయారని.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఇలా చాలా మంది కాంగ్రెస్ లో ఓడిపోయారని స్పష్టం చేశారు. కనీసం రేవంత్ రెడ్డి నమస్కారం పెడితే కూడా స్పందించడని.. రేవంత్ పై నిప్పులు చెరిగారు. దాదాపు 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న వారు ముఖ్యమా..? నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వారు ముఖ్యమా అని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.