ఈ నెల 31 న వైస్సార్సీపీ కాపు నేతల సమావేశం..టార్గెట్ పవన్ నేనా ..?

ఈ నెల 31 న వైస్సార్సీపీ కాపు నేతలు సమావేశం కాబోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఓ హోటల్‌లో వీరంతా సమావేశంకానున్నారు. ఈ సమావేశానికి ఏపీలో ఉన్న మొత్తం వైస్సార్సీపీ కాపు ఎమ్మెల్యే లు , ఎమ్మెల్సీ లు , ఎంపీలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ..వైస్సార్సీపీ లోని కాపు నేతలపై చేసిన కామెంట్స్ ఫై వీరంతా సమావేశం కాబోతున్నట్లు తెలుస్తుంది.

తాము వైస్సార్సీపీ పార్టీ కోసం 12-13 ఏళ్ళుగా కష్టపడి పనిచేసి, వివిధ పదవులను చేపట్టామని.. తమను తోటి కాపు కులస్థుడైన పవన్ కళ్యాణ్ అవమానిస్తే.. మిగతా కులాల వారు ఏ విధంగా చూస్తారన్న కనీస ఆలోచన, స్పృహ లేదా అని కొందరు కాపునేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు..? పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఫై ఎలా స్పందిస్తారనేది చూడాలి. ప్రస్తుతం ఏపీలో రాజకీయ వేడి నడుస్తుంది. వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఘటన తర్వాత జనసేన స్పీడ్ పెంచింది. అలాగే రాష్ట్రంలో కూడా జనసేన కు ప్రజల నుండి మద్దతు పెరిగిపోతుండటంతో వైస్సార్సీపీ నేతలు దూకుడు పెంచుతున్నారు.