వరంగల్ జిల్లాలో దారుణం : తాగొచ్చి వేధిస్తున్నాడనీ.. భర్తను చంపిన భార్య

TDP leader murder in Guntur district

రోజు తాగొచ్చి వేధిస్తున్నాడనీ భర్తను చంపిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా లోని పర్వతగిరి మండలం ముంజాల కుంట తండాలో నివసం ఉంటున్న జాటోతూ శ్రీనుకు శాంతితో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. గత కొంతకాలంగా మద్యానికి బానిసైన శ్రీను..ప్రతి రోజు తాగి వచ్చి భార్య ను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం శ్రీను అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు మృతుని భార్య శాంతిని విచారించగా అసలు విషయం బయటపడింది. తాగి వచ్చి తనను చిత్రహింసలకు గురిచేస్తుండటంతో భర్తను చంపేందుకు శాంతి పథకం పన్నింది. పథకం ప్రకారం భార్య శాంతి మరో వ్యక్తి సహాయంతో శ్రీనును హత్య చేసింది. అనంతరం రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా నిందితులు చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మృతుడి భార్య శాంతిని, ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.