రేషన్ స్కామ్ కేసు..బెంగాల్ మంత్రి అరెస్ట్
కోల్కతాః రేషన్ స్కామ్ కేసులో పశ్చిమ బెంగాల్ మంత్రి , టీఎంసీ నేత జ్యోతిప్రియ మల్లిక్ అరెస్ట్ అయ్యారు. మల్లిక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు.
పశ్చిమ బెంగాల్లో రేషన్ పంపిణీ స్కామ్కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో జ్యోతిప్రియ మల్లిక్ గతంలో ఆహార మంత్రిగా ఉన్న సమయంలో రేషన్ పంపిణీ స్కామ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మల్లిక్ను ఈడీ విచారించింది. దాదాపు 20 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత శుక్రవారం తెల్లవారుజామున ఆయన్ని తన నివాసంలోనే అరెస్టు చేసినట్లు ఈడీ వెల్లడించింది.
మరోవైపు మల్లిక్ అరెస్ట్పై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈడీ విచారణలో మంత్రి ఆరోగ్యం క్షీణిస్తే అధికారులే బాధ్యత వహించాలని అన్నారు. ఈ దాడుల వల్ల మంత్రికి ఏమైనా అయితే.. బిజెపి, దర్యాప్తు సంస్థలపై కేసులు పెడతామని హెచ్చరించారు.