దేశంలో కొత్తగా 2841 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటలో కొత్తగా 2841 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కరోనా బాధితులు 4,31,16,254కు చేరారు. ఇందులో 4,25,73,460 మంది డిశ్చార్జీ అయ్యారు. 18,604 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 5,24,190 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో 9 మంది మృతిచెందగా, 3295 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.74 శాతంగా ఉందని, మరణాల రేటు 1.22 శాతంగా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు 1,90,99,44,803 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. గురువారం ఒకేరోజు 14,03,220 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని వెల్లడించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/