ఎన్టీఆర్ ఆశయసాధన కోసమే ట్రస్ట్ను ఏర్పాటు చేశాంః చంద్రబాబు
![Chandrababu to sit office again](https://www.vaartha.com/wp-content/uploads/2023/09/Chandrababu-to-sit-office-again-jpg.webp)
అమరావతిః ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 27 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సిబ్బంది, వలంటీర్లకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్టు చేశారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు తాను నెలకొల్పిన ట్రస్ట్ రక్తదానం, ఆరోగ్య సంరక్షణ, విద్య, సాధికారత, జీవనోపాధి రంగాల్లో సేవలందించడంతోపాటు ప్రకృతి విపత్తులో సైతం ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తున్నారని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.