పంజాబ్‌లో నేడు తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్న ఆప్

ప్రజల ఆకాంక్షలకు పెద్దపీట వేశామన్న భగవంత్ మాన్

we-gave-top-priority-for-people’s-interest-in-budget-says-punjab-cm-bhagwant-singh-mann

చండీగఢ్‌ః పంజాబ్ అసెంబ్లీలో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. ఆ రాష్ట్రంలో తొలిసారి అధికారాన్ని చేజిక్కించుకున్న ఆప్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్ ఇది. రాష్ట్ర ఆర్షిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలకు పెద్ద పీట వేయడానికే బడ్జెట్ లో అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చామని చెప్పారు. గత ఏడాది ఈరోజు ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలుపొందామని… ఏడాది తర్వాత ఈ రోజున తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. పంజాబ్ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక దినమని చెప్పారు. తమ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తును, ప్రజల జీవితాలను మార్చే విధంగా ఉంటుందని తెలిపారు.