మదనపల్లిలో అందరు చూస్తుండగా మహిళపై వాలంటీర్ దాడి..

ఓ పక్క రాష్ట్రంలో వాలంటీర్లు అనేక నేరాలకు పాల్పడుతున్నారని పవన్ ఆరోపిస్తుండగానే..ప్రతిరోజు వాలంటీర్ల నేరాలు బయటకు వస్తూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఓ వృద్ధురాలిని హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న నగదును ఎత్తుకెళ్లాడు ఓ వాలంటీర్..ఆ తర్వాత మరో చోట వివాహేతరను ఓ వాలంటీర్ ప్రేమ పేరుతో లేపుకుని పోయాడు. ఈరోజు మదనపల్లి లో ఓ వాలంటీర్ మహిళఫై అందరు చూస్తుండగా దాడి చేసి వార్తల్లో నిలిచాడు.

మదనపల్లిలో గిరిరావు వీధిలో మహేష్ అనే వాలంటీర్ పని చేస్తున్నాడు..తాను ఓ వాలంటీర్ అని , తాను ఏంచేసినా అడిగేవారు లేరనే ధీమాతో ప్రతి రోజు రాత్రిపూట మద్యం సేవించి , స్నేహితులతో కాలనీ లలో హల్చల్ చేస్తుంటాడు. ఆదివారం రాత్రి కూడా అలాగే చేస్తుండడం తో కాలనీలో ఉండే చంద్ర అనే వ్యక్తి వారిని వారించాడు. అయితే వాలంటీర్ ను అయిన తననే ప్రశ్నిస్తావా అని మహేష్.. చంద్రపై బూతులు అందుకున్నాడు.

ఈ లోపు చంద్ర భార్య గౌతవి ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాలంటీర్ మహేష్ ను నిలదీసింది. కాలని యువకులందర్నీ చెడగొడుతున్నావని.. అంతే కాకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నావని మండిపడింది. దీంతో మద్యం మత్తులో ఆగ్రహం వ్యక్తం చేసిన మహేష్.. మహిళ అని కూడా చూడకుండా గౌతమిపై దాడి చేశాడు. కాలనీ ప్రజలు చూస్తూండాగనే ఇష్టం వచ్చినట్లుగా దాడి చేశారు. ఈ దాడిలో గౌతమికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన పోలీసులువాలంటీర్ ను అదుపులోకి తీసుకున్నారు.