చంద్రబాబుకు హెరిటేజ్ ప్రయోజనాలే ఎక్కువైపోయాయి

వ్యవసాయ బిల్లులపై మారు మాట్లాడకుండా మద్దతిచ్చాడు బాబు.. విజయసాయిరెడ్డి

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతోన్న రైతులు ఇచ్చిన బంద్ పిలుపునకు దేశ వ్యాప్తంగా స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. టిడిపి అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

‘వ్యవసాయ బిల్లులపై మారు మాట్లాడకుండా మద్దతిచ్చాడు బాబు. స్వామినాథన్ కమిటీ రిపోర్టు అమలు చేయాలని, కనీస మద్దతు ధర ఉండాల్సిందేనని, వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలమైన మేము పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడాం. మూడు వ్యవసాయ బిల్లులపై ఒక్క సవరణైనా సూచించావా బాబూ? చంద్రబాబుకు హెరిటేజ్ ప్రయోజనాలే ఎక్కువైపోయాయి’ అంటూ విమర్శలు గుప్పించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/