సత్తుపల్లి శ్రీ చైతన్య స్కూల్ లో ఘనంగా వసంత పంచమి వేడుకలు

సత్తుపల్లి, ఫిబ్రవరి 14 : ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని స్థానిక కృష్ణవేణి( శ్రీ చైతన్య ) స్కూల్ లో వసంత పంచమి వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. సరస్వతి మాత పుట్టిన రోజు కావడంతో వేద పండితుల మంత్రోశ్ఛరణల మధ్య పాఠశాల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం జరిగింది.

ఈ సందర్బంగా ప్రిన్సుపాల్ నాగరాజు మాట్లాడుతూ.. శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర మాఘ శుద్ధ పంచమి గడియలలో రేవతి నక్షత్రం, మీన లగ్నంలో ప్రవేశించిందని, ఈ రోజు అక్షరాభ్యాసానికి మంచిరోజు అన్నారు. పూజారులు సర స్వతీమాత పూజ నిర్వహించి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు.

శ్రీ చైతన్య విద్యాసంస్థల అధిపతులు శ్రీధర్ గారు , శ్రీ విద్య గార్ల ప్రోత్సాహంతో DGM చేతన్, AGM రమేష్ గారి నిర్వహణ లో స్కూల్ ప్రధానోపాధ్యాయుడు నాగరాజు , వైస్ ప్రిన్సుపాల్ అజిత మరియు పాఠశాల సిబ్బంది తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.