భారీ ధర పలికిన వారసుడు ఆడియో రైట్స్

విజయ్ – రష్మిక జంటగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం వారసుడు. తెలుగు , తమిళ్ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ తాలూకా ఆడియో రైట్స్ భారీ ధర పలికినట్లు సమాచారం. ఒకటి , రెండు కాదు ఏకంగా ఆడియో రైట్స్‌ దాదాపు రూ.10 కోట్లకు అమ్ముడయ్యాయట. ఈ నెంబర్‌ అటు విజయ్‌ కెరీర్‌లోనూ.. ఇటు థమన్‌ కెరీర్‌లోనూ బిగ్గెస్ట్‌ అట. అంతేకాకుండా తమిళంలోనూ అత్యధిక రేటుకు అమ్ముడైన టాప్‌-5 మ్యూజిక్‌ ఆల్బమ్‌లలో ఒకటిగా నిలిచింది. కాగా ఈ సినిమాలో ఫస్ట్‌ సింగిల్‌ దివాళికి రానున్నట్లు సమాచారం.

తమన్ స్వరపరిచిన పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా ఇంతకుముందే తెలుపడం జరిగింది. ‘బీస్ట్’ తరువాత విజయ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్లే సినిమాను తెరకెక్కించారా..లేదా అనేది చూడాలి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ పతాకాలపై దిల్‌ రాజు, శిరీష్‌, పరమ్‌ వి పొట్లూరి, పెరల్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు.