ఏపీ సీఎస్ కు కేంద్ర హోంశాఖ లేఖ

సునీల్ కుమార్ పై అవసరమైతే చర్యలు తీసుకోవాలని ఆదేశం

న్యూఢిల్లీ : తనను అక్రమంగా అరెస్ట్ చేసి, విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ముఖ్యంగా సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ, చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ స్పందించింది. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ విషయంలో నిర్ణయం తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి సంజీవ్ కుమార్ ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు. అవసరమైతే సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ ను ఆదేశించారు. చర్యల వివరాలకు సంబంధించి త్వరగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/