ప్రధాని భద్రతకు నిధులు పెంపు

రూ.540 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పెరిగిన నిధులు

Narendra Modi
Narendra Modi

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడి భద్రత మరింత పటిష్ఠం కానుంది. ఆయన రక్షణ బాధ్యతలు చూసుకునే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ)కి తాజా బడ్జెట్‌లో నిధులను 11 శాతం మేర పెంచారు. దీంతో ప్రస్తుతం కేటాయించిన రూ.540 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పెరిగింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లకు కూడా గతేడాది వరకు ఎస్‌పీజీ భద్రత ఉండేది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఈ భద్రతను ఉపసంహరించింది. ప్రస్తుతం ప్రధాని
మోడికి మాత్రమే ఎస్‌పీజీ భద్రత ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/