మహబూబ్ నగర్ జిల్లాలో ఘోరం..మైనర్ బాలిక ఫై అత్యాచారం..
తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. చట్టాలకు , పోలీసుల శిక్షలకు , కోర్టులకు ఏమాత్రం భయపడడం లేదు. స్నేహం పేరుతో యువతులకు దగ్గరవుతూ, వారి లైంగిక కోరిక తీర్చుకుంటున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా ఎంత వైరల్ అయ్యిందో తెలియంది కాదు..ఈ ఘటన తర్వాత కూడా రాష్ట్రంలో ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అత్యాచార ‘వార్త ‘ వార్తల్లో నిలుస్తూనే ఉంది.
తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. జిల్లాలోని కోయిలకొండ మండలంలో రవి కూమార్ అనే యువకుడు మైనర్ బాలికకు పరిచయం అయ్యాడు. ఆ బాలికతో పలుమార్లు మాట్లాడి.. స్నేహం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రెండు నెలల కిందట రవికుమార్, మరో యువకుడు గడ్డం శ్రీకాంత్ తో కలిసి.. బాలిక గ్రామమైన అంకిళ్లకు వెళ్లారు. బాలిక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. యువకులు ఇద్దరూ ఒకరి తర్వాత.. ఒకరు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలికకు రెండు నెలలైనా నెలసరి కాకపోవడంతో.. తల్లి కోయిలకొండ ఆస్పత్రికి తీసుకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించింది. బాలిక గర్భవతి అని తేలడంతో.. తన కూతురును నిలదీసింది. దీంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఆ నిందితులపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.