అమెరికా లో ఘోర రోడ్డు ప్రమాదం : ఇద్దరు హైదరాబాద్ యువకులు మృతి

అమెరికా లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. జాన్స్ బర్గ్ హైవేపై వెళుతున్న కారు అదుపుతప్పి ఓ ట్రాక్టర్ ట్రెయిలర్ పైకి దూసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మహ్మద్ ఫైసల్, ఇషాముద్దీన్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. మూడో విద్యార్థికి తీవ్రగాయాలు కాగా అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.వారి మృతదేహాలు హైదరాబాద్ చేరుకున్నాయి. మహ్మద్ ఫైసల్, ఇషాముద్దీన్ లకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.