రేపు టీటీడీ ధర్మకర్తల మండలి భేటీ
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి శనివారం సమావేశం కానుంది. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అన్నమయ్య భవన్లో జరుగనుంది. సమావేశానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా నేపథ్యంలో నేరుగా హాజరుకాలేని సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో శ్రీవారి దర్శనం టికెట్ల కోటా పెంపు, ప్రస్తుతం తిరుపతిలో నిర్మిస్తున్న గరుడవారధిని అలిపిరి వరకు పొడిగింపుపై విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/