శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల

జులై, ఆగస్ట్ నెలలకు ప్రత్యేక దర్శనం టికెట్ల విడుదల

తిరుమల: జులై, ఆగస్ట్ నెలలకు సంబంధించి రూ. 300 విలువైన శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. టీటీడీ ఆన్ లైన్ పోర్టల్ నుంచి టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది. రోజుకు 25 వేల టికెట్ల చొప్పున టీటీడీ ఆన్ లైన్లో ఉంచింది. మరోవైపు టీటీడీ మరో కీలక ప్రకటన చేసింది. వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో జులై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు టీటీడీ ప్రటించింది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కేవలం ప్రొటోకాల్ ఉన్న ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసినట్టు తెలిపింది. tirupatibalaji.ap.gov.in లింక్ ద్వారా టీటీడీ వెబ్ సైట్లో లాగిన్ అయి టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/