ఈరోజు ఏపీకి హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారు

amith shah
amith shah

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు శనివారం తిరుపతికి రానున్నారు. మూడు రోజుల పాటు అమిత్ షా రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. 14న ఉద‌యం నెల్లూరులో ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. అదే రోజు మ‌ధ్యాహ్నం తిరుప‌తిలో నిర్వ‌హించే స‌ద‌ర‌న్ జోన‌ల్ సీఎంల స‌మావేశంలో కేంద్ర హోంమంత్రి పాల్గొన‌నున్నారు. అమిత్ షాకు సీఎం జగన్ స్వయంగా స్వాగతం పలకనున్నారు. సీఎం జగన్ సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు రేణిగుంట చేరుకుంటారు.

అక్కడ అమిత్ షాకు స్వాగతం పలికి, అనంతరం తిరుమల వెళ్లి రాత్రి 9.30 గంటలకు స్వామివారి దర్శనం చేసుకోనున్నారు. ఆపై తిరిగి రేణిగుంట చేరుకుని తాడేపల్లి పయనమవుతారు. మరుసటిరోజు (ఆదివారం) మధ్యాహ్నం 1.15 గంటలకు గన్నవరం నుంచి తిరుపతి పయనమవుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి అమిత్ షా అధ్యక్షతన తిరుపతి తాజ్ హోటల్లో జరిగే దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం ఢిల్లీకి పయనమవుతారు.