నేడు మధ్యాహ్నం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
అమరావతిః నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టిటిడి విడుదల చేయనుంది. జనవరి నెల కోటాకు సంబంధించిన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. దీంతో జనవరి నెల మొత్తానికి సంబంధించిన టికెట్లను భక్తులు బుక్ చేసుకోచ్చు. ఈ నెల 16, 31వ తేదీదీలకు సంబంధించి ప్రత్యేక రూ.300 దర్శనం టైం స్లాట్ టోకెన్లను రేపు (మంగళవారం) విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు ఈ టికెట్లను అందుబాటులో ఉంటాయి. కాగా.. ఈ నెల 16 సాయంత్రం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. దీంతో 17వ తేదీ నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను టిటిడి రద్దు చేసింది.
ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో టిటిడి విడుదల చేయనుంది. కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను టిటిడి విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ, పాద పద్మారాధన సేవా టికెట్లు విడుదల కానున్నాయి. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి.. టిటిడి అధికారిక వెబ్సైట్లో శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని టిటిడి సూచించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/