కాంగ్రెస్ లో చేరే ఫస్ట్ ఎమ్మెల్యే ను నేనే – RK

ఏపీలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం రాబోతోందా..అంటే అవుననే అంటుంది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైంది. కనీసం పోటీ చేసేందుకు కూడా ఎవ్వరు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ పగ్గాలు వైస్ షర్మిల పట్టబోతుందని తెలిసి అందరిలో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. రేపు ఢిల్లీ వేదికగా షర్మిల కాంగ్రెస్ పార్టీ లో చేరబోతోంది. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేప్పట్టబోతోంది. ఇక షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ముందుగా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్లగడ్డ రామకృష్ణ ..కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు స్వయంగా తెలిపారు. భవిష్యత్‌లో వైఎస్ షర్మిలతో కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో పోటీపై షర్మిల, కాంగ్రెస్ సూచనల మేరకు నడుచుకుంటానని తేల్చి చెప్పారు. కాగా, వైసీపీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదంటూ తీవ్ర అసంతృప్తికి గురైన ఆర్కే.. ఇటీవల వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.