ఇరాన్ పూర్తి బాధ్యత వహించక తప్పదు
వాషింగ్టన్:బాగ్దాద్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ మద్దతు ఆందోళనకారులు దాడి జరపడంతో అమెరికా భగ్గు మంది. అమెరికా విమాన దాడులకు రెండు డజన్ల మంది పోరాట యోధులు మరణించడంతో ఆందోళనకారులు అమెరికా రాయబార కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఇరాన్ నుంచి అమెరికా బలగాలు తొలగి పోవాలని డిమాండ్ చేశారు. అమెరికన్లు చనిపోతే దానికి తగిన శిక్ష ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెహ్రాన్ను హెచ్చరించారు. మరణాలకు ఇతర నష్టాలకు ఇరాన్ పూర్తి బాధ్యత వహించక తప్పదని ట్రంప్ హెచ్చరించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/