ముగ్గురు భారతీయులకు కీలక పదవులు
ముగ్గురు భారతీయులకు కీలక పదవులు ఇచ్చిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ భారత సంతతి మహిళా సరితా కొమటిరెడ్డి న్యాయవాదిని న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టు జడ్జిగా నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో ఇద్దర్నికి అత్యంత కీలకమైన పదవును ఇచ్చారు. ఇద్దరిలో భారతీయ అమెరికన్ న్యాయవాది అశోక్ మైఖేల్ పింటో, భారతీయ అమెరికన్ సీనియర్ దౌత్యవేత్త మనీషా సింగ్ ఉన్నారు. అశోక్ మైఖేల్ పింటోను ప్రపంచ బ్యాంకులో రుణాలు అందించే విభాగమైన అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకుకు నామినేట్ చేయగా, పారిస్ కేంద్రంగా పనిచేసే ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)కి తన రాయబారిగా మనీషా సింగ్ను ట్రంప్ నామినేట్ చేశారు.
తాజా జాతీయవ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/