కౌంటింగ్‌ ఆపండి..కోర్టుకెళ్లిన ట్రంప్‌ టీమ్‌

trump
trump

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల కౌంటింగ్ ఇంకా కొన‌సాగుతున్న‌ది. బైడెన్‌, ట్రంప్ మ‌ధ్య మ్యాజిక్ మార్క్ కోసం జోరుగా పోరు సాగుతోంది. ఈ నేప‌థ్యంలో అధ్య‌క్షుడు ట్రంప్ టీమ్‌.. కోర్టుకు వెళ్లింది. విస్కిన్‌స‌న్‌లో రీకౌంటింగ్ చేయాల‌ని ట్రంప్ టీమ్ డిమాండ్ చేసింది. ఇక మిచిగ‌న్ రాష్ట్రంలో బ్యాలెట్లు లెక్కించ‌వ‌ద్దు అంటూ కోర్టులో దావా వేసింది. మాజీ ఉపాధ్య‌క్షుడు జో బైడెన్ స‌డ‌న్‌గా రెండు కీల‌క రాష్ట్రాల్లో విజ‌యం సాధించ‌డంతో.. ట్రంప్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన‌ట్లు అయ్యింది. దీంతో ట్రంప్ బృందం కోర్టుకు వెళ్తోంది. జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో కూడా ట్రంప్ ప్ర‌చార బృందం కోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. బైడ‌న్ టీమ్ కూడా త‌మ లీగ‌ల్ బృందాల‌ను సిద్ధం చేసింది. తాము కూడా కోర్టుకు వెళ్ల‌నున్న‌ట్లు బైడెన్ ప్ర‌చార మేనేజ‌ర్ జెన్ ఓ మాలే డిల్ల‌న్ తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/