టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల
ఈనెల 20 నుంచి దరఖాస్తుల ప్రక్రియ
హైదరాబాద్ః తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (TRT) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 5089 స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, లాంగ్వేజ్ పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నెల 20 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 20 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.