ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సభలో అమిత్ షా
బిజెపికి ఓటు వేస్తే షహీన్బాగ్ వంటి ఘటనను నివారించవచ్చని వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి నిర్వహంచిన సభలో కేంద్ర మంత్రి అమిత్షా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..బిజెపికి ఢిల్లీ ప్రజలు వేసే ఓటు ద్వారా దేశాన్ని, ఢిల్లీని సురక్షితంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) విమర్శిస్తున్న వారిపై విమర్శలు గుప్పించారు. తమ పార్టీకి ఓటు వేస్తే షహీన్బాగ్ వంటి వేలాది ఘటనలను నివారించవచ్చని అమిత్ షా చెప్పారు. ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో ఈవీఎంలో బటన్ నొక్కడం ద్వారా ఇటువంటి ఘటనలను ప్రతిఘటించవచ్చని వ్యాఖ్యానించారు. కాగా, సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్లో పెద్ద ఎత్తున అలుపెరుగని పోరాటం చేస్తోన్న విషయం తెలిసిందే.
తాజా ఎడిటోరియల్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/editorial/