యాదాద్రిలో బండి సంజయ్ కి వ్యతిరేకంగా టిఆర్ఎస్ శ్రేణుల నిరసన

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మరికాసేపట్లో యాదాద్రికి చేరుకోనున్నారు. ఈ క్రమంలో యాదాద్రిలో టిఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ కి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ గో..బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

మొయినాబాద్ ఎపిసోడ్పై నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేయాలని బండి సంజయ్.. సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరినా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బండి సంజయ్ మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ నుంచి యాదగిరిగుట్టకు బయలుదేరారు. ఆయన వెంట పలువురు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. యాదగిరి గుట్టలో ప్రమాణం చేసి నిజాయితీ నిరూపించుకుంటామని బండి తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. పోలీసులు అడ్డుకున్నా తాను యాదగిరిగుట్టకు వెళ్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు.