టిఆర్‌ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ 5వ తేదీనః సిఎం కెసిఆర్‌

TS CM KCR
TS CM KCR

హైదరాబాద్‌ః టిఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ అక్టోబర్ 05 ఉదయం 11 గంటలకు యధావిధిగా జరగుతుందని పార్టీ అధినేత సిఎం కెసిఆర్‌ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో దాని ప్రభావం, దసరా నాటి టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశం పైన ఉండదని, సభ్యులు అనుమానాలకు గురికావద్దని అన్నారు. ముందుగా ప్రకటించినట్టే అక్టోబర్ 05 వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో పార్టీ సర్వసభ్య సమావేశం కొనసాగుతుందని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. అందరూ నిర్దేషిత సమయంలోపే హాజరుకావాలన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/