ఎమ్మెల్యే షకీల్, ఎంపీ ధర్మపురి అర్వింద్ మధ్య తారాస్థాయికి చేరిన మాటల యుద్ధం

TRS MLA Shakeel – BJP MP Dharmapuri Arvind war

గత కొద్దీ నెలలుగా టిఆర్ఎస్ – బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా హైదరాబాద్ లో బిజెపి తలపెట్టిన జాతీయ కార్య నిర్వహణ సమావేశాలు , భారీ బహిరంగ సభతో మరింత వేడెక్కింది. ఈ తరుణంలో తాజాగా రాష్ట్రంలో చోటుచేసుకున్న భారీ వర్షాలు, వరదలు మరోసారి కాకరేపాయి. బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్, బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.రాష్ట్ర ప్రజలు భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోతుంటే ఎంపీ అర్వింద్ ఎక్కడున్నారని షకీల్ ప్రశ్నించారు. ఎంత సేపు ముఖ్యమంత్రిని తిట్టడం తప్ప ఆయనకు మరోపని లేదని ఎద్దేవా చేసారు.

ధర్మపురి అర్వింద్ ఎక్కడ ఉంటె అక్కడ నుండి సోషల్ మీడియాలో కామెంట్లు చేయడమే ఆయన పని అని
షకీల్ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇంత వరకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని విమర్శించారు. వరదల సమయంలో ప్రజలను పట్టించుకోకుండా తిరుగుతున్న అర్వింద్ వస్తే… ప్రజలు నిలదీయాలని, చెప్పుతో కొట్టాలని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై అర్వింద్ ఘాటుగా స్పందించారు. షకీల్ ను పందితో పోల్చారు. పందిని తాను పట్టించుకోనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపితే కేంద్రం సాయం చేస్తుందని అన్నారు. వరద నష్టంపై నివేదికలు పంపడం కేసీఆర్ సర్కార్ కు చేత కాదని ఎద్దేవా చేశారు.