నల్గొండ లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై దాడి..

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫై బిఆర్ఎస్ కార్య కర్తలు దాడికి యత్నించిన ఘటన నల్గొండ లో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా శాలి గౌరారం మండలం ఇటుకలపాడు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బొడ్రాయి పండుగలో పాల్గొన్న కోమటిరెడ్డి కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇటుకలపాడు గ్రామానికి వచ్చే రోడ్డు బాగోలేదని.. గ్రామానికి చేరుకోడానికి సుమారు 3 గంటల సమయం పట్టిందని విమర్శలు గుప్పించారు.

కేవలం కోటి రూపాయలు పెడితే రోడ్డు వేయొచ్చన్నారు. ప్రగతిభవన్‌, కొత్త సెక్రటేరియట్లు కట్టొచ్చు కానీ.. రోడ్డు వేయటానికి చేతులు రావట్లేదని మండిపడ్డారు. దీంతో.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వెంకట్ రెడ్డిపైకి కర్తలు, కుర్చీలు విసిరారు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్‌ కార్యకర్తలు బీఆర్ఎస్‌ కార్యకర్తలపై ఎదురుదాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం, జరిగింది. కాసేపు అక్కడ బీఆర్ఎస్ vs కాంగ్రెస్ అన్నట్లుగా రణరంగంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.