కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు : ముగ్గురు మృతి
గుజరాత్ : గుజరాత్లో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, 15మంది గాయపడ్డారు. రాష్ట్రంలోని పంచమహల్ జిల్లాలోని ఫ్లోరో కెమికల్స్ ఫ్యాక్టరీలో ఈరోజు భారీ పేలుడు ఘటన సంభవించింది. ఘోఘంబ తాలూకాలోని రంజిత్నగర్ గ్రామానికి సమీపంలో ఉన్న గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ లిమిటెడ్ (జీఎఫ్ఎల్) రసాయన తయారీ కర్మాగారంలో జరిగిన ఈ పేలుడు శబ్దాలు కొన్ని కిలోమీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. కాగా, అగ్నిమాపక దళాలు వెంటనే అక్కడికి చేరుకొని మంటలు అదుపులోకి వచ్చాయని పంచమహల్ ఎస్పీ లీనా పాటిల్ తెలిపారు. గాయపడిన వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/