ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల పాటు వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, కోస్తా ప్రాంతంలో ఇప్పటికే అక్కడక్కడా వర్షాలు నమోదవుతున్నాయని.. రానున్న మూడు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ నెల 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టింది. మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది. ఈ నెల 3న ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని, పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 4న కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. 5న రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.