మూడు కొత్త బస్సులు దగ్ధం.. కండక్టర్ సజీవ దహనం
పంజాబ్: పంజాబ్ బఠిండాలో ఘోర ప్రమాదం సంభవించింది. భాగతా భాయ్ బస్టాండ్లో నిలిపి ఉన్న మూడు బస్సులు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో కండక్టర్ సజీవ దహనమయ్యాడు. మంటల్లో కాలిపోయిన మూడు బస్సుల్లో రెండు కొత్తవి కావడం గమనార్హం. ఈ రోజే వాటిని ప్రారంభించాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రమాదం జరగ్గా.. కొత్త బస్సులు కాలిపోయాయి. అయితే ఈ బస్సులు ఎలా కాలిపోయాయనే విషయం తెలియాల్సి ఉంది.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/