జమ్ముకశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్
జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్లోని సోపోర్ జిల్లాలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. జిల్లాలోని డంగీవాచా ప్రాంతంలో ముగ్గురు టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అల్బదర్ ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా గుర్తించారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/