వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఫైర్

ఏపీలోని అధికార పార్టీ వైస్సార్సీపీ ఫై బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గుంటూరు జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా జోనల్ ఇన్చార్జి నాగుల్ మీరాతో పాటు పలువురు బీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జగన్ పాలనలో సామాన్య ప్రజలు స్వేచ్ఛగా బతకలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. టిడిపి , వైస్సార్సీపీ మోసపూరిత వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలు వంచనకు గురయ్యారని అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని… మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు.