ఎపిలో టెలిమెడిసిన్‌ టోల్‌ఫ్రీ నెం: 14410

పర్యవేక్షించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశం

CM YS Jagan who telephoned toll free number and started telemedicine

Amaravati: : కరోనా నివారణ చర్యల్లో భాగంగా డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌ కార్యక్రమాన్ని సోమవారం సిఎం జగన్మోహనరెడ్డి ప్రారంభించారు.

క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సిఎం జగన్‌ తొలిసారిగా టెలిమెడిసిన్‌ టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌చేసి డాక్టర్‌తో మాట్లాడారు.

ఈ విధానాన్ని పటిష్టంగా, బలోపేతంగా నడపాలని అధికారులను సిఎం ఆదేశించారు.. క్రమంత తప్పకుండా పర్యవేక్షించాలని, అవసరమైతే వైద్యుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు.

కార్యక్రమంలో డిప్యూటీ సిఎం ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిజిపి గౌతమ్‌ సవాంగ్‌, ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్‌ వెస్సార్‌ టెలిమెడిసిన్‌ ఎలా పనిచేస్తుందంటే…

  • రాష్ట్రంలో డాక్టర్‌ వైఎస్సార్‌ టెలి మెడిసిన్‌ అమలు కోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నెంబర్‌ 14410 కేటాయించారు.
  • ఈ కార్యక్రమంలో స్వచ్చందంగా సేవలందించేందుకు ఈనెల 11వ తేదీ నాటికే 286 మంది వైదులు, 114 మంద ఎగ్జిక్యూటివ్స్‌ తమ పేర్లు నమోదు చేసుకున్నారు
  • డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌లో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు షిప్టుల్లో ఆరోగ్య సేవలు

టెలిమెడిసిన్‌ ఉద్దేశ్యం: కోవిడ్‌-19 కేసులను గుర్తించటం , ఐసొలేట్‌ చేయటం, పరీక్షించటం, క్వారంటైన్‌కు పంపించటం. ఓపి సేవలు, ఔషధాల కోసం టెలిఫోన్‌ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు డాక్టర్లకు ఇంటర్నెట్‌ సదుపాయం ఉంటుంది.. టెక్నికల్‌ ఆసిస్టెన్స్‌, టెక్నాలజీ టీం నుంచి లభిస్తుంది.

మూడంచెలుగా డాక్టర్‌ వైఎస్సార్‌ టెలి మెడిసిన్‌

స్టెప్‌-1:

  • 14410 టోల్‌ఫ్రీ నెంబరుకు రోగులు మిస్డ్‌కాల్‌ ఇస్తే చాలు.. అక్కడి సిస్టమ్‌ ఆ మొబైల్‌ నెంబరును మొత్తం వివరాలను నమోదు చేసుకుంటుంది.
  • ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్‌ రోగికి కాల్‌ చేసి, వారు ఉంటున్న ప్రదేశం, వయసు , రోగ లక్షణాల వంటి పూర్తి వివరాలు తెలుసుకుంటారు..
  • రోగికి ఒక గుర్తింప సంఖ్య (ఐడి) ఇస్తారు.

స్టెప్‌-2:

  • రోగి వివరాలన్నీ టెలిమెడిసిన్‌ వ్యవస్థకు కనెక్ట్‌్‌ అయిన వైద్యులందరికీ కన్పిస్తాయి
  • ఆ సమయంలో డాక్టర్ల బృందంలో ఎవరో ఒకరు ఆ కాల్‌ను స్వీకరించి, కాల్‌చేసి ఓపి సేవలు అందిస్తారు
  • ఆ రోగికి నిర్వహించవలసిన పరీక్షలు, అందించాల్సిన మందులను వైద్యులు తెలియజేస్తారు
  • వ్యాధి లక్షణాలను బట్టి కోవిడ్‌-19 అనుమానిత రోగులను గుర్తిస్తారు.
  • ఆ తర్వాత ఎస్‌ఎంఎస్‌ ద్వారా చికిత్స వివరాలు రోగికి అందుతాయి
  • అవసరమైన సందర్భాల్లో వీడియో కన్సల్టేషన్‌ కూడ ఉంటుంది.
  • అవసరమైతే వీరిని ఏ ఆసుపత్రికి పంపించాలి. ఎక్కడకు పంపించాలన్న దానిపై కూడ వైద్యులు నిర్ణయం తీసుకుని ఆ మేరకు వారిని తరలిస్తారు.

స్టెప్‌-3:

  • కోవిడ్‌-19 అనుమానిత కేసుల జాబితా రూపకల్పన.
  • ఆ రోగులకు అవసరమైన పరీక్షలు, క్వారంటైన్‌, ఐసోలేషన్‌తోపాటు చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సి), జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆ జాబితాలు.
  • ఈ జాబితాలను జిల్లా అధికారులకు పంపిస్తారు. తీసుకోవాల్సిన చర్యలన్నీ సక్రమంగా జరిగేలా చూసుకుంటారు..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో

  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యాధికారులకు ప్రిస్కిప్షన్లు పంపిస్తారు
  • ప్రతి ఒక్కరోగికి అవసరమైన ఔషధాలను ప్రత్యేకంగా ప్యాక్‌ చేసి ఆశ వర్కర్లు, ఎఎన్‌ఎంలు , గ్రామవార్డు వాలంటీర్ల ద్వారా రోగులకు నేరుగా ఇంటికే పంపిస్తారు.
  • నాన్‌ కోవిడ్‌ రోగులకు కూడ మందులు అందించే కార్యక్రమం ఉంటుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/